న్యూ ఢిల్లీ:
ఢిల్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ భవనంలోకి ముగ్గురు దుండగులు అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించినట్లు సమాచారం. గేట్ నెంబర్ 3 నుంచి ఖాసీం, మోసిన్, షోయబ్ నకిలీ ఐడీలతో పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.