*కొత్తూరు మండల కేంద్రములో గోగుల ఆధ్వర్యంలో ఘనంగా మామిడి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు*
డిసెంబర్ 11వ తేదీన రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా కొత్తూరు మండల కేంద్రములో రాజవీది లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం లో స్వర్గీయ శ్రీ గోగుల చల్లం నాయుడు తనయుడు గోగుల మాధవి వరప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో భాగంగా మొదటగా కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, పల్లు, రొట్టెలు పంచిపెట్టారు.అనంతరం రాజవీధి లో గల వైఎస్సార్సీపీ కార్యాలయంలో భారీ కేక్ కటింగ్ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు అభిమానులు,గ్రామస్థులు, స్కూల్ విద్యార్థులుల సమక్షంలో మామిడి శ్రీకాంత్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అనే స్లొగన్స్ తో మార్మోగుతూ ఘనంగా జరిగింది.
కేక్ కటింగ్ కార్య క్రమం ఐన తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది.ఈ అన్నదాన వితరణ లో గ్రామస్థులతో పాటు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అన్నదాన వితరణ కార్యక్రమం అనంతరం కొత్తూరు గ్రామమే కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాల నిరుపేదలకు, ముసలి అవ్వ తాతలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొత్తూరు సర్పంచ్ ప్రతినిధి పడాల లక్ష్మణ రావు, పారాపురం మాజీ ఎంపీటీసీ సభ్యులు కుంచాల నూకరాజు, కొమనాపల్లి వలసి నాయుడు రౌతు సాయి నాయుడు, పిన్నింటీ రామారావు నాయుడు, ఆర్కె నాయుడు, లోతుగెడ్డ జనార్దన,చుక్కా రాంబాబు, కర్నేన రమణ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ పుట్టిన రోజు వేడుకలకు వచ్చి ఇంత ఘనంగా జరగటానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ గొగుల మాధవి వరప్రసాద్ నాయుడు ధన్య వాదాలు తెలిపారు.